Warangal | క్యాబిన్లో ఇరుక్కున్న బస్సు డ్రైవర్ కాలు సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు స్థానికులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా ఆరెపల్లి దర్గా ఓగులాపూర్ సమీపంలో పరకాల నుంచి హనుమకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు క్యాబిన్లో డ్రైవర్ కాలు ఇరుక్కుపోయింది. తనను కాపాడాలంటూ అరుపులతో డ్రైవర్ అభ్యర్థించారు. పోలీసులు స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ కాలును బయటకు […]
Warangal |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా ఆరెపల్లి దర్గా ఓగులాపూర్ సమీపంలో పరకాల నుంచి హనుమకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు క్యాబిన్లో డ్రైవర్ కాలు ఇరుక్కుపోయింది. తనను కాపాడాలంటూ అరుపులతో డ్రైవర్ అభ్యర్థించారు.
పోలీసులు స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ కాలును బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రమాదంతో ములుగు, హనుమకొండ ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించి, రాకపోకలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్ శ్రీనివాస్ కు తీవ్ర గాయాలుకావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తరలించారు.