TDP | కాళహస్తి నాయుడికి బారికేడ్ల అడ్డంకి.. TDPలోకి రాలేక, వైసీపీలో ఇమడలేక అవస్థలు
TDP బొజ్జల సుధీర్ రెడ్డి, నాయుడు మధ్య సయోధ్యకు యత్నం 14న కుప్పం రావాలని చంద్రబాబు ఆదేశం విధాత: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది.. ఉన్నచోట ఉండకుండా అటు ఇటు కదిలి.. ఇప్పడు ఎటూ కాకుండా పోయాడు పాపం కాళహస్తి నాయుడు. టిడిపిలో ఉంటూ ఆమధ్య వైఎస్సార్సీపిలోకి వచ్చిన NCV నాయుడు ఇప్పుడు అక్కడ ఇమడలేక టిడిపిలోకి వద్దామని చూస్తున్నారు. అంతా అనుకున్నట్లు సాగితే ఈరోజే అయన టీడీపీలోకి మళ్ళీ వచ్చి చేరేవారు కానీ […]

TDP
- బొజ్జల సుధీర్ రెడ్డి, నాయుడు మధ్య సయోధ్యకు యత్నం
- 14న కుప్పం రావాలని చంద్రబాబు ఆదేశం
విధాత: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది.. ఉన్నచోట ఉండకుండా అటు ఇటు కదిలి.. ఇప్పడు ఎటూ కాకుండా పోయాడు పాపం కాళహస్తి నాయుడు. టిడిపిలో ఉంటూ ఆమధ్య వైఎస్సార్సీపిలోకి వచ్చిన NCV నాయుడు ఇప్పుడు అక్కడ ఇమడలేక టిడిపిలోకి వద్దామని చూస్తున్నారు.
అంతా అనుకున్నట్లు సాగితే ఈరోజే అయన టీడీపీలోకి మళ్ళీ వచ్చి చేరేవారు కానీ అక్కడి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి మోకాలు అడ్డడంతో పాపం నాయుడు గారు టిడిపిలోకి రాలేక, ఇప్పటికే వైసిపిలో ఇమడలేక చాలా అవస్థలు పడుతున్నారు.
వాస్తవానికి ఎస్సీవి నాయుడు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన టిడిపిలోకి చేరారు. అయినా సీటు ఇవ్వకపోవడంతో ఊరుకుని, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కానీ ఇన్నాళ్ళున్నా ఆయనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు రాకపోయేసరికి మల్లి టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు నేడు, గురువారం టిడిపిలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.
చంద్రబాబు అనుమతులు, ఎపాయింట్మెంట్ సైతం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే తన క్యాడర్ కు సైతం సమాచారం అందించి మళ్ళీ తాను టిడిపిలోకి వెళ్తున్నట్లు వారికీ చెప్పేసారు. అయితే ఇన్చార్జిని తానూ ఉండగా తనకు కనీసం చెప్పకుండా, తన అంగీకారం లేకుండా నాయుడు మళ్లీ టిడిపిలో చేరడాన్ని ఇష్టపడని సుధీర్ రెడ్డి తన పవర్ చూపించారు.
నియోజకవర్గ ఇన్చార్జిని అయిన తనకు చెప్పకుండా ఎస్సీవీ నాయుడును పార్టీలో ఎలా చేర్చుకుంటారని సుధీర్ రెడ్డి నేరుగా అధిష్టానాన్ని ప్రశ్నించడమే కాకుండా ఒక వాయిస్ మెసేజ్ కూడా విడుదల చేసారు. ఆయన పార్టీలో చేరడానికి అమరావతి వెళితే వాళ్ళనీ కానీ కార్యకర్తలు ఎవరూ పోవద్దని సుధీర్ రెడ్డి వాయిస్ మెసేజ్ కార్యకర్తలతోబాటు అధిష్టానానికి చేరింది.
దీంతో ఈతకాయ తెచ్చుకుని తాటికాయ వదిలేసుకోవడం ఎందుకని భయపడిన చంద్రబాబు, అధిష్టానం ఈ చేరికను తాత్కాలిక వాయిదా వేసింది. ఇక ఈ ఇద్దరి మధ్య సఖ్యత నెలకొల్పేందుకు చర్యలు ప్రారంభించింది. జూన్ 14న కుప్పంలో తాను ఉంటానని, అక్కడ మాట్లాడుకోవచ్చని ఆరోజు ఇద్దరూ అక్కడికి రావాలని, బొజ్జల సుధీర్ రెడ్డితోబాటు NCV నాయుడికి ఇప్పటికే కబురు అందింది.