Virat Kohli | సెంచరీతో సత్తా చాటిన కోహ్లీ.. ఇండియా సహనాన్ని పరీక్షిస్తున్న విండీస్
Virat Kohli: ప్రస్తుతం బార్బడోస్ వేదికగా ఇండియా, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం విదితమే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ జట్టు భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్, యశస్వి అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేశారు. తొలి వికెట్కి 139 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం యశస్వి జైస్వాల్ పెవిలీయన్ బాట పట్టాడు. అతను 74 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 57 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్లో ఔట్ […]

Virat Kohli: ప్రస్తుతం బార్బడోస్ వేదికగా ఇండియా, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం విదితమే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ జట్టు భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్, యశస్వి అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేశారు.
తొలి వికెట్కి 139 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం యశస్వి జైస్వాల్ పెవిలీయన్ బాట పట్టాడు. అతను 74 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 57 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.ఇక 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసి వర్రీకాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. రహానే కూడా త్వరగానే పెవీలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజులో ఉన్న జడేజా, విరాట్ కోహ్లీలు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే ఓవర్ నైట్ స్కోరు 288/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మంచి స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇక ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కాగా, ఈ మ్యాచ్లో సెంచరీ సాధించారు.
మొత్తానికి కోహ్లీ తన కెరీర్లో 76వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశారు. ఈ ఏడాది కోహ్లీ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. రెండు వన్డే సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, మరో రెండు టెస్టు సెంచరీలు కూడా నమోదు చేశాడు. అయితే ఈ టెస్ట్లో విరాట్ కోహ్లీ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడం విశేషం.
ఇక కోహ్లీతో కలిసి ఐదో వికెట్కి 159 పరుగుల భాగస్వామ్యం జోడించిన రవీంద్ర జడేజా 152 బంతుల్లో 5 ఫోర్లతో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ అయిన జయ్దేవ్ ఉనద్కట్ 7 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ సిరాజ్ 11 బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు.
రవిచంద్రన్ అశ్విన్ 78 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి టెస్టుల్లో 14వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జోమల్ వర్రీకాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా, షెన్నాన్ గ్యాబ్రియల్కి ఓ వికెట్ దక్కింది.
ఇక టీమిండియా ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్కి దిగిన విండీస్ జట్టు ఇండియాకి ధీటుగా ఆడింది.41 ఓవర్స్ ఆడిన వెస్టిండీస్ జట్టు వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.చందర్ పాల్ 33 పరుగులకి జడేజా బౌలింగ్లో ఔట్ కాగా, ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం క్రీజులో బ్రాత్ వైట్(37), మెకంజీ(14) ఉన్నారు. ఈ రోజు వారు ఎంత స్కోర్ చేస్తారనేది చూడాలి.