Census 2027 : జన గణనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర కేబినెట్ 2027 జన గణనకు 11,718 కోట్లు కేటాయించింది, MGNREGA పేర్లు, పనిదినాలు, కూలీలు పెంపు చేసినట్లు నిర్ణయం.
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జన గణనకు రూ.11,718కోట్ల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. 2027లో రెండు విడతల్లో డిజిటల్ టెక్నాలాజీతో జన గణన చేపట్టాలని నిర్ణయించింది.
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన’గా పేరు మార్చింది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం పనిదినాల్లోనూ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా ఉన్న 100 పనిదినాలను 125 రోజులకు పెంచింది. రోజు కూలీ రూ.240గా నిర్ణయించింది. బొగ్గు గనుల్లో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Akhanda 2 | బాక్సాఫీస్పై ‘అఖండ 2’ తుపాను… సినిమా చూసి వచ్చి బాలయ్యకి అభిమాని ఫోన్
HIV : ఐటీ ఉద్యోగులారా! తస్మాత్ జాగ్రత్త..ఆ వైరస్ తో డేంజర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram