Delhi Liquor case | లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్, సిసోడియా, కవిత కస్టడి పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ ఆశిస్తున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆరెస్ ఎమ్మెల్సీ కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ ఆశిస్తున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆరెస్ ఎమ్మెల్సీ కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో వారికి ఈ నెల 31 వరకు రిమాండ్ పొడిగించింది.
తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను జైలు అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. మరోవైపు సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన కేసులో సైతం కోర్టు ఆగస్టు 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ తాజాగా న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. కవిత కేసులో రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణలోకి తీసుకుంది.