నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయాలకు నేను బలయ్యానన్నారు
కేసీఆర్, ఉత్తమ్ కుమ్మక్కవ్వడం వల్లే నేను ఓడిపోయా
విధాత: నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయాలకు నేను బలయ్యానన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కైయరన్నారు. ఈ విషయం తెలియక తాను మోసపోయానని తెలిపారు. బీఆరెస్, కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నేనే మంత్రిని అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు చెప్పుకున్నారని, అందుమూలంగానే నేను ఎన్నికల్లో ఓడిపోయనన్నారు. తెలంగాణలో బీఆరెస్, కాంగ్రెస్ ఒక్కటేనని సైదిరెడ్డి ఆరోపించారు. బీఆరెస్కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసినట్లే అన్నారు. దేశమంతా మోదీ గాలి వీస్తోంది, ప్రపంచమంతా మోదీ వైపు చూస్తోందన్నారు. దేశరక్షణ కోసం బీజేపీ అధికారంలో ఉండాలని దేశప్రజలు కోరుకుంటున్నారని శానంపూడి పేర్కొన్నారు.