కేంద్ర సర్కారు ఈ ఏడాది అయిదు భారత రత్న అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. కర్పూరీ ఠాకూర్, ఎల్కే అద్వానీ, పీవీ నర్సింహారావు, చౌదరీ చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు ఈ ఏడాది భారత రత్న అవార్డులను ప్రకటించారు
Bharat Ratna | న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఈ ఏడాది అయిదు భారత రత్న అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. కర్పూరీ ఠాకూర్, ఎల్కే అద్వానీ, పీవీ నర్సింహారావు, చౌదరీ చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు ఈ ఏడాది భారత రత్న అవార్డులను ప్రకటించారు. అయితే ప్రతి ఏడాది ఎంత మందికి భారత రత్న అవార్డులను ఇవ్వవొచ్చో తెలుసా. అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రతి ఏడాదికి ఇంత మందికే ఇవ్వాలన్న నిబంధన ఏమైనా ఉందా. ఈ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం లేకున్నా.. ప్రతి ఏడాది ముగ్గురికి భారత రత్న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అయిదుగురికి భారత రత్న అవార్డులను ప్రకటించింది.
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీకి కేంద్రం ‘భారత రత్న’ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి అవార్డులు ప్రకటించింది కేంద్రం.
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరుకుల కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఇప్పటివరకు నలభై మందికిపైగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.
ప్రతి ఏడాది ఈ పురస్కారాన్ని ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తుంటారు. దేశ ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని ఈ పురస్కారానికి సిఫారసు చేయవచ్చు. కానీ, దీనికి పరిమితి మాత్రం లేదు. 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. అంతే అప్పటి నుంచి ఏడాదికి ముగ్గురికి మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఏకంగా ఐదుగురికి భారతరత్న వరించడం విశేషం. కాగా, ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైనవారిలో ఎల్కే అద్వానీ మాత్రమే జీవించి ఉన్నారు.
అయితే భారతరత్న పొందడానికి జాతి, వృత్తి, స్థానం, లింగభేదం చూడరు. ఏదైనా రంగంలో అసాధారణమైన సేవ లేదా అత్యున్నత స్థాయి పనితీరుకు గుర్తింపుగా భారతరత్న అందించబడుతుంది. భారతరత్న అవార్డుకు సంబంధించిన సిఫారసులను ప్రధాని స్వయంగా రాష్ట్రపతికి అందజేస్తారు. అనంతరం రాష్ట్రపతి ఆ పత్రంపై సంతకం చేస్తారు.
ఇప్పటి వరకు భారతరత్న పురస్కారాల గ్రహీతల జాబితా
1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు) :1954
2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి) – 1954
3. చంద్రశేఖర వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954
4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య సమర యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955
5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజినీర్, రాజనీతిజ్ఞుడు, మైసూర్ దివాన్) – 1955
6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి ప్రధానమంత్రి)- 1955
7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమర యోధుడు) – 1957
8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, విద్యావేత్త)- 1958
9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నాయకుడు, పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త)- 1961
10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు) – 1961
11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజనీతిజ్ఞుడు, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962
12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1963
13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు) -1963
14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాన మంత్రి) – 1966
15. ఇందిరా గాంధీ (రాజకీయవేత్త, భారత మాజీ ప్రధానమంత్రి) -1971
16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ రాష్ట్రపతి) -1975
17. కుమారస్వామి కామ్రాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) 1976
18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) – 1980
19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త) -1983
20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య సమర యోధుడు) -1987
21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనాయకుడిగా మారిన నటుడు) -1988
22. భీమ్ రావ్ రామ్జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త) -1990
23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష వ్యతిరేక యోధుడు) – 1990
24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయవేత్త, భారత మాజీ ప్రధానమంత్రి) -1991
25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు) – 1991
26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాన మంత్రి) – 1991
27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు) -1992
28. జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త) – 1992
29. సత్యజిత్ రే (చిత్ర దర్శకుడు, నిర్మాత) – 1992
30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య సమర యోధుడు) – 1997
31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధురాలు) – 1997
32. ఏపీజే అబ్దుల్ కలాం (ఏరోస్పేస్, రక్షణ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి) -1997
33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయకురాలు) -1998
34. చిదంబరం సుబ్రమణ్యం (అరుణా అసఫ్ అలీ) – 1998
35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు) – 1999
36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త) – 1999
37. లోక్ప్రియా గోపీనాథ్ బోర్దోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు) – 1999
38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) – 1999
39. లతా దీనానాథ్ మంగేష్కర్ (ప్లే బ్యాక్ సింగర్) – 2001
40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్) – 2001
41. భీమ్సేన్ గురురాజ్ జోషి (హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు) – 2009
42. సీఎన్ఆర్ రావు (రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్) – 2014
43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్) – 2014
44. అటల్ బిహారీ వాజ్పేయి (రాజకీయవేత్త, భారత మాజీ ప్రధానమంత్రి) 2015
45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త) – 2015
46. నానాజీ దేశ్ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త) – 2019
47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (నేపథ్య గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) – 2019
48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 2019
49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయవేత్త, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024
50. లాల్ కృష్ణ అద్వానీ (రాజకీయవేత్త, మాజీ ఉప ప్రధాన మంత్రి)- 2024
51. పాములపర్తి వెంకట నరసింహారావు (మరణానంతరం) (భారత మాజీ ప్రధానమంత్రి) – 2024
52. చౌదరి చరణ్ సింగ్ (మరణానంతరం) (భారత మాజీ ప్రధాన మంత్రి) -2024
53. మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ (మరణానంతరం) (వ్యవసాయ శాస్త్రవేత్త) – 2024.