ప్రజా తీర్పును గౌరవిస్తాం…సంస్కరించుకుంటాం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై.. హరీశ్‌రావు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో బీఆరెస్ శ్రేణులు నిరాశ చెందాల్సిన పనిలేదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమని తాము సంస్కరించుకుంటూ.. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుతామని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు.

ప్రజా తీర్పును గౌరవిస్తాం…సంస్కరించుకుంటాం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై.. హరీశ్‌రావు

విధాత : లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో బీఆరెస్ శ్రేణులు నిరాశ చెందాల్సిన పనిలేదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమని తాము సంస్కరించుకుంటూ.. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుతామని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, 24ఏళ్ల చరిత్రలో బీఆరెస్‌ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని పేర్కోన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదని, లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలదీస్తామని తెలిపారు.