తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ అనడం సరికాదని ఆలోచన మాకు లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు.
కుమ్మక్కు రాజకీయాలు వారివే
బీఆరెస్, కాంగ్రెస్లపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజం
సికింద్రాబాద్లో కిషన్రెడ్డి గెలుపుపై ధీమా
విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ అనడం సరికాదని ఆలోచన మాకు లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారన్నారు. బీఆరెస్ అడుగు జాడలో కాంగ్రెస్ పయనిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతుందని, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మోదీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.తెలంగాణలో రెండంకెల స్థానాలు గెలుస్తామన్నారు. సికింద్రాబాద్లో మచ్చలేని మా నాయకుడు కిషన్రెడ్డి మళ్లీ మంచి మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బీజేపీకి కంచుకోట అని, ఇక్కడ కమలం పార్టీ గెలుపు ఖాయం అయిందన్నారు. సికింద్రాబాద్ ప్రజల తలలో నాలుకలా కిషన్ రెడ్డి పని చేశారన్నారు.
బీజేపీ అభ్యర్ధి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసం పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణలో అన్ని పార్టీల కంటే బీజేపీనే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ సాగుతుందని, బీఆరెస్కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు.