బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం(ఏప్రిల్ 23) నాడు ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు మీడియాలో ప్రచారం ఊపందుకుంది
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం(ఏప్రిల్ 23) నాడు ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు మీడియాలో ప్రచారం ఊపందుకుంది. పన్నెండేళ్ల తర్వాత ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్లీ రాబోతుందని తెలుగు స్క్రైబ్ అనే ఎక్స్ ఖాతాలో రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.
Big Exclusive
పన్నెండేళ్ళ తరువాత ఆ బ్లాక్బస్టర్ కాంబినేషన్ మళ్లీ రాబోతుంది!
రేపు సర్ప్రైజ్ ఇవ్వనున్న కేసీఆర్..! pic.twitter.com/Oh8ofYU3Ss
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2024
అయితే తెలుగు స్క్రైబ్ ట్వీట్పై రకరకాల ప్రచారం జరుగుతుంది. నెటిజన్లు తమ ఆలోచనలను షేర్ చేసుకుంటున్నారు. 2013లో పార్టీ నుంచి సస్పెండ్కు గురైన విజయశాంతిని మళ్లీ బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. కోదండరాంతో కేసీఆర్ జతకడుతారేమో అని చర్చించుకుంటున్నారు. అధికారం పోయిందని కేసీఆర్ మళ్లీ ఆమరణ దీక్ష చేస్తాడేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈటల రాజేందర్ను మళ్లీ పార్టీలోకి తీసుకుంటారా..? అని చర్చించుకుంటున్నారు. లేదంటే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నాడా..? అని కామెంట్లు పెడతున్నారు.
Tomorrow,
Get ready for the biggest & exclusive interview with a towering political stalwart in Telugu.
Can you guess who’s joining us? 🤔
Stay tuned! 📺 – @TV9Telugu #Telangana #AndhraPradesh— Rajinikanth Vellalacheruvu (@rajinikanthlive) April 22, 2024
మరో విషయం ఏంటంటే.. తెలుగు స్క్రైబ్ ట్వీట్ చేసిన గంట తర్వాత టీవీ9 రజినీకాంత్ కూడా ఒక ట్వీట్ చేశారు. రేపు సిద్ధంగా ఉండండి. తెలుగు రాష్ట్రాల్లోని అతి పెద్ద నాయకుడితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఉండబోతోందని రజినీకాంత్ పేర్కొన్నారు. మీరు ఎవరైనా గెస్ చేయగలరా..? అని ఆయన ప్రశ్నించారు. ఇక తెలుగు స్క్రైబ్ ట్వీట్కు రజినీకాంత్ ట్వీట్ను నెటిజన్లు జోడించారు. కేసీఆర్ రజినీకాంత్ కాంబినేషన్లో ఇంటర్వ్యూ రాబోతోందని చాలా మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఏం సర్ప్రైజ్ ఉండబోతోందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి చూడక తప్పదు.