విధాత: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత మల్లు ఇంద్రసేనారెడ్డిని గవర్నర్గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
రాష్ట్రపతి భవన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఈ ఫిర్యాదులో తెలిపింది. ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. దేశంలో ఎన్నికల కోడ్ అందరికి సమానంగా వర్తిస్తుందా లేదా అనే అంశం పై వివరణ ఇవ్వాలని తెలిపింది.