కాంగ్రెస్ రెండో జాబితాపై కసరత్తు.. స్క్రీనింగ్ కమిటీ భేటీపైనే ఫోకస్‌

కాంగ్రెస్ రెండో జాబితాపై కసరత్తు.. స్క్రీనింగ్ కమిటీ భేటీపైనే ఫోకస్‌
  • ఆశావహుల చివరి ప్రయత్నాలు


విధాత: ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో శనివారం సాయంత్రం పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ కాబోతుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను ఫైనల్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు ఎన్ . ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లు ఢిల్లీకి చేరుకున్నారు.


కాగా.. సాయంత్రం 4గంటలకు జరిగే భేటీలో వామపక్షాల పొత్తు, టీజేఎసీ కోరిన సీట్లపై కూడా చర్చించనున్నారు. మరోవైపు పార్టీ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు ఢిల్లీకి వెళ్లి తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ, సీడబ్ల్యుసీ నేతలతో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుల చుట్టు తిరుగుతు టికెట్ల కోసం ఆఖరి ప్రయత్నాలు సాగిస్తుండటం కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియపై మరింత ఆసక్తి పెంచింది.