భాజపాలో చేరిన మాజీ మంత్రి ఈటల

విధాత:దిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, పలువురు ఉస్మానియా ఐకాస నేతలు భాజపాలో చేరారు. ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే […]

భాజపాలో చేరిన మాజీ మంత్రి ఈటల

విధాత:దిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు.

ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, పలువురు ఉస్మానియా ఐకాస నేతలు భాజపాలో చేరారు.

ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈటల కీలక పాత్ర పోషించారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన సేవలందించారన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తాము సత్తా చాటబోతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈటల వంటి నేతల చేరికతో భాజపా బలపడుతోందన్నారు.