వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా మరోసారి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
విధాత : వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా మరోసారి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నియోజవర్గం నుంచి క్రితం సారి జరిగిన ఎన్నికల్లోనూ గుజ్జులనే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆరెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలువగా, ఇండిపెండెంట్ తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో, ప్రొఫెసర్ కోదండరామ్ మూడో స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా, బీఆరెస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకుడు అశోక్ పోటీలో ఉన్నారు. మే 9వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగియ్యనుండగా, 10న పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ ఉండనుంది. ఉప ఎన్నికల పోలింగ్ మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు వరకు జరుగనుంది. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు.