జానపద కళాకారుడు, పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు తాను అండగా ఉంటానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
సహాయంపై హామీ
విధాత, హైదరాబాద్ : జానపద కళాకారుడు, పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు తాను అండగా ఉంటానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తాజాగా మొగిలయ్య ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూలి పనులు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆ విషయంపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించి తాను మొగిలయ్యకు అండగా ఉంటానని తెలిపారు. ఆదివారం కేటీఆర్ స్వయంగా మొగిలయ్యను కలిసి ఆయన సమ్యలు తెలుసుకుని, తాను అవసరమైన సహాయం చేస్తానని భరోసా నిచ్చారు.
ఈ సందర్భంగా మొగిలయ్య మాట్లాడుతూ తనకు స్థలం ఇప్పించాలని, తాను కోట్లు, లక్షలు కూడా చూడలేదని, మొదటి నుంచి ఎన్నో కష్టాలు పడుతు బతుకువెళ్లదీస్తున్నాని తెలిపారు. కేసీఆర్ పుణ్యమా అని నాకు గుర్తింపు వచ్చిందని, స్థలం ఒక్కటి ఇప్పిస్తే ఇక ఏమీ అడగనన్నారు. స్పందించిన కేటీఆర్ తప్పకుండా స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మొగిలయ్య గొప్ప కళాకారుడని, ఆయన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్గిరి బీఆరెస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.