నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది
నందికొండ మునిసిపల్ చైర్ పర్సన్ గా తిరుమల కొండ అన్నపూర్ణ
వైస్ చైర్మన్ గా ఆదాసు నాగరాణి విక్రమ్
నాగార్జునసాగర్ ,మార్చి, 22 : నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది . చైర్ పర్సన్ ,వైస్ చైర్ పర్సన్ ల పదవులను కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో మున్సిపాలిటీ నమోదయింది .నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ గా తిరుమల కొండ అన్నపూర్ణ ,వైస్ చైర్ పర్సన్ గా ఆదాసు నాగరాణి విక్రమ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నందికొండ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ల పై గత నెల ఫిబ్రవరి 15న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా తీర్మానం నెగ్గడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు నందికొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ,ప్రిసైడింగ్ ఆఫీసర్ మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాస్ అధ్యక్షతన నందికొండ మున్సిపల్ కౌన్సిలర్లచే ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మంది కౌన్సిలర్లు మోహన్ రావు, అన్నపూర్ణ, శ్వేతా రెడ్డి, ఈర్ల రామకృష్ణ, రమేష్ జి, నాగ శిరీష మోహన్ నాయక్, మంగతా నాయకులు హాజరయ్యారు. వీరందరూ నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ గా అన్నపూర్ణను, వైస్ చైర్ పర్సన్ గా ఆదాసు నాగరాణి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ప్రెసెడిoగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రకటించారు. నూతనముగా ఎన్నుకోబడిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి శేఖర్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్ పర్సన్ నాగరాణిలు మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని, నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకుగాను మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి, శాసనసభ్యులు జైవీర్ రెడ్డికి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డికి, తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి కి మరియు తమ ఎన్నికలకు సహకరించిన కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు