మా ఊరి బిడ్డ మంత్రయ్యిందీ
మంత్రి హోదాలో ములుగు మండలంలోని తన స్వగ్రామం జగ్గన్న పేట గ్రామానికి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

– జగ్గన్నపేటకు వచ్చిన మంత్రి సీతక్క
– మంత్రిగా తొలిసారి పుట్టిన ఊరికి
– ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
– ఢిల్లీకి రాజు అయిన తల్లికి బిడ్డేనే
– పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటా
– స్వగృహంలో తల్లిదండ్రుల ఆశీస్సులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మంత్రి హోదాలో ములుగు మండలంలోని తన స్వగ్రామం జగ్గన్న పేట గ్రామానికి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి ఘన స్వాగతం పలికి, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను మీ ఆడ బిడ్డను ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన బిడ్డను.. నేను పుట్టిన గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాపైన ఉందన్నారు. ప్రజలు నాపైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ములుగు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోనటువంటి వాళ్ళు చేసుకోవాలని సూచించారు. అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని మంత్రి సీతక్క అన్నారు.

సీతక్కకు ఘన సన్మానం
అనంతరం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాలువా, పూలమాలలతో సత్కరించారు. మా ఊరి బిడ్డ మంత్రి అయ్యిందంటూ సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్స వడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యామ్, ఉప సర్పంచ్ సదానందం, అర్రెం వెంకన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల, గ్రామ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.