బీఆరెస్ అధికార మదంతో విర్రవీగుతోందని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సామాన్యులకు మనుగడ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
విధాత, ఇల్లందు: బీఆరెస్ అధికార మదంతో విర్రవీగుతోందని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సామాన్యులకు మనుగడ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లందు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మృతుల కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మృతి చెందిన పేద కుటుంబాలకు మూడేళ్లుగా రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ తోనే సామాన్యులకు మనుగడకాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమోఘమని, ప్రతి నిరుపేద, మధ్యతరగతి కుటుంబానికీ చేయూతనిస్తాయన్నారు. ఇల్లందులో కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ కట్ట బెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు, ప్రధాన కార్యదర్శి ఆరెం కిరణ్, నాయకులు శివరాత్రి ఎల్లయ్య, మస్తాన్, వీరబాబు, స్వామి, కాకటి రమేష్, ప్రభాకర్, కుంటా రాములు, శ్రీను, లక్ష్మీ నారాయణ, నరసింహారావు, అబ్బయ్య, బాలకృష్ణ, రావూరి సతీష్ పాల్గొన్నారు.