ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పరిణామం ఫోన్ టాపింగ్ కేసులో తీవ్రమైన మలుపుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వం విపక్ష రాజకీయ ప్రతనిధులతోపాటు, వ్యాపారులు, అధికారులు, జర్నలిస్టులతో పాటు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి
విధాత ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం మంగళవారం చోటుచేసుకుంది. రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పరిణామం ఫోన్ టాపింగ్ కేసులో తీవ్రమైన మలుపుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వం విపక్ష రాజకీయ ప్రతనిధులతోపాటు, వ్యాపారులు, అధికారులు, జర్నలిస్టులతో పాటు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా స్వీకరించి మంగళవారం చీఫ్ జస్టీస్ తో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ జరపనున్నది.
హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణల నేపద్యంలో ఈ కేసును సుమోటాగా స్వీకరించినట్లు భావిస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో జడ్జిల ఫోన్ టాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకులతో పాటు అధికారులు తమకు గిట్టను వారి ఫోన్లు టాప్ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రభుత్వం కొట్టి పారేసింది. కానీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో కంప్యూటర్లు ఇతర పరికరాలు ధ్వంసం చేయడంతో ఫోన్ టాపింగ్ పై అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై ఏర్పాటు చేసిన సీట్ విచారణలో అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీఐ ప్రణీత్రావుతో ప్రారంభమైన అరెస్టుల వ్యవహారం ఎస్ఐబీలో పనిచేసిన తిరుపతన్న, భుజంగరావు, మాజీ డిసిపి రాధాకృష్ణ రావులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే గత ప్రభుత్వంలో ఎస్ఐ బీచ్ గా పని చేసిన ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల సూచనలతో ఆయనే కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ వర్గాలను కుదిపేస్తుండగా తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఏ మలుపు తీసుకుంటుందో అని చర్చ సాగుతుంది. ఆదివారమే మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ హెచ్చరించిన నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం గమనార్హం.
REad MORE
Phone Tapping case | ఫోన్ ట్యాపింగ్పై ప్రణీత్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
Phone Tapping Case | ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుకు నాన్ బెయిల్బుల్ వారెంట్
Phone tapping case | నాడు రేవంత్ చుట్టు Praneeth Rao | ఎస్ఐబీనీ కుప్పకూల్చిన ప్రణీత్ రావు.. దశాబ్దాల మావోయిస్టు డాటా లాస్ట్యాపింగ్ వ్యూహం