కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆ శాఖ పనితీరు సక్రమంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. శనివారం గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆ శాఖ పనితీరు సక్రమంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. శనివారం గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీసరలో రూ.100 కోట్ల భూముల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇందిరా గాంధీ హయాంలో కీసర పరిధిలో మాదిగలకు 94 ఎకరాల భూమిని 10 మందికి ప్రభుత్వం కీసరలో ఇచ్చిందని వీహెచ్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణారెడ్డి దురుద్దేశంతో సంతకాలు పోర్టరీ చేసి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపై చర్యలూ తీసుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ భూముల్లో వెంటనే పనులు ఆపేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. పేదలు భూములు కోల్పోతే, మరోవైపు అక్కడ విల్లాలు కడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎవరి భూమి వారికే అన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా కూడా భూముల స్కామ్లపై చర్యలు కొరవడ్డాయని అసంతృప్తి వెళ్లగక్కారు. వెంటనే రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.