మూడు గంట‌ల పాటు అల్లు అర్జున్‌ని ఎండ‌లో నిల‌బెట్టిన సుకుమార్.. పుష్ప2 ఆల‌స్యానికి కార‌ణం ఇదా?

మూడు గంట‌ల పాటు అల్లు అర్జున్‌ని ఎండ‌లో నిల‌బెట్టిన సుకుమార్.. పుష్ప2 ఆల‌స్యానికి కార‌ణం ఇదా?

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన చిత్రాల‌లో పుష్ప మూవీ ఒక‌టి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అతి పెద్ద విజ‌యం సాధించింది. ఈ సినిమాకే కాకుండా ఇందులోని డైలాగ్స్‌కి, పాట‌ల‌కి ప్ర‌తి ఒక్క‌రు ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యారు. సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్స్ సైతం ఇందులోని పాట‌ల‌కి స్టెప్పులేసి ర‌చ్చ చేశారు. ఈ క్ర‌మంలో పుష్ప క్రేజ్ విప‌రీతంగా పెరిగి పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కి నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కింది. ఇక బ‌న్నీ ఇప్పుడు పుష్ప 2 అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమా గ‌త కొద్ది రోజులుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం ఇదికాగా, ఈ మూవీ స‌రికొత్త చరిత్ర సృష్టించ‌డం ఖాయం అని అంటున్నారు.

ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆమె ఇందులో రిపోర్ట‌ర్‌గా క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దివి త‌న పాత్ర గురించి మాట్లాడుతూ..న్యూస్ రిపోర్టర్ రోల్ చేయడం అంత ఈజీ కాదు. కొందరు నటులతో పాటు రియల్ న్యూస్ రిపోర్టర్స్ తో కొన్ని సన్నివేశాలు తెర‌కెక్కించ‌గా, ఆ స‌మ‌యంలో కొంద‌రు న‌న్ను నెట్టుకుంటూ వెళ్లిపోయారు. అప్పుడు నేను కింద‌ప‌డిపోయాను. సుకుమార్ గారు ప‌ర్‌ఫెక్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కు ఆ సీన్‌ని తెర‌కెక్కిస్తూనే ఉంటారు. పుష్ప 2లో ప్రతి షాట్ కి ఆయన 5 నుండి 35 టేక్స్ తీసుకుంటున్నారు. నటులు ఎటునుంచి రావాలి, ఎలా చూడాలి… ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు.

ఆల‌స్య‌మైన ప‌ర్వాలేదు. మంచి ఔట్‌పుట్ రావాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఓ సీన్ కోసం అల్లు అర్జున్ 40 టేకులు తీసుకున్నారు. మూడు గంట‌ల పాటు ఎండ‌లో నిలుచున్నారు. సుకుమార్ తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టు తీయాల‌ని అనుకుంటున్నారు. అందుకే అంత ఆల‌స్యం అవుతుంద‌ని , పుష్ప‌2 మాత్రం అంద‌రి అంచ‌నాల‌కి మించి ఉంటుంద‌ని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ మూవీని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసే ఆలోచ‌న చేస్తున్నారు.