వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

విధాత: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సరికొత్త తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుమీద తమకు నమ్మకం లేదని. అందువల్ల ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మరెక్కడైనా విచారించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని విచారణకు స్వీకరించిన కోర్ట్ ఈ కేసు విచారణను తెలంగాణలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. మరోవైపు వివేకా హత్య […]

వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

విధాత: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సరికొత్త తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుమీద తమకు నమ్మకం లేదని. అందువల్ల ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మరెక్కడైనా విచారించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని విచారణకు స్వీకరించిన కోర్ట్ ఈ కేసు విచారణను తెలంగాణలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది.

మరోవైపు వివేకా హత్య కేసు విచారణకు స్థానిక యంత్రాంగం ఏమాత్రం సహకరించడం లేదని.. ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని గతంలో సుప్రీంకోర్టులో సీబీఐ సైతం అఫిడివిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

వివేకా కుమార్తె సునీత, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఈ ఇరువురూ కేసు విచారణపై అసంతృప్తిగా ఉన్నందున.. వారి ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్.షా తెలిపారు.

మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య సుప్రీంకోర్టు వరకూ రావడమంటే ఈ కేసులో ఎన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అర్థమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా హత్య కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్లుగా రుజువులు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నది.

ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉందని, ఇంకా కేసును తారుమారు చేయడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగాల్సి ఉందన్నారు. అందుకే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నామని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఈ తీర్పు ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వైఎస్ఆర్ కుటుంబీకులు ఇంకొందరు ఈ హత్య కేసులో ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో కోర్టు ఇలాంటి తీర్పు రావడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.