Gold Rates | బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. దాంతో బంగారం అంటేనే బాబయ్ అనే పరిస్థితులు నెలకొన్నాయి. 22 క్యారెట్లపై బంగారంపై రూ.10 పెరిగి తులం రూ.63,010 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 పెరిగి రూ.68,740కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.63,910 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.69,720కి చేరుకుతుంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.63,010 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.68,740కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.63,160 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.68,890కి పెరిగింది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.63,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.68,740 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు మరో వైపు వెండి ధర సైతం పైకి కదిలింది. రూ.100 పెరిగి కిలోకు రూ.77,900కి ఎగిసింది. హైదరాబాద్లో వెండి కిలో రూ.80,900 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.