బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధర..! హైదరాబాద్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
బంగారం ప్రియులకు గుడ్న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

బంగారం ప్రియులకు గుడ్న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్పై రూ.90 తగ్గి రూ.55,450కి చేరింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి రూ.60,490 చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,640కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,490కి చేరింది.
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,900 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,980 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,490 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం దిగివచ్చాయి. వెండి కిలోకు రూ.600 తగ్గి రూ.72,400కు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కిలో రూ.75,400 ధర పలుకుతున్నది.