మగువలకు బంగారం ధరలు ఊరట కలిగిస్తున్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్లో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి
Gold Rates | మగువలకు బంగారం ధరలు ఊరట కలిగిస్తున్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్లో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గి తులానికి రూ.57,690 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.62,940 పలుకుతున్నది. మరో వైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలోకు రూ.100 చొప్పున పెరిగి కిలో రూ.75,600కు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,290 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,590కి తగ్గింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,690 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,940కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,840 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,090 దిగివచ్చింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,690 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,940 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం పెరగడంతో హైదరాబాద్లో కిలో వెండి రూ.77,100కి చేరింది.
మరో వైపు ప్లాటినం ధరలు స్థిరంగా ఉన్నాయి. తులం ప్లాటినం ధర దేశవ్యాప్తంగా రూ.23,320 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.