Gold Rate | పసిడి ధర పెరుగుదల కొనసాగుతున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి డిమాండ్ పెరుగుతుండడంతో దేశీయ మార్కెట్లోనూ ఆ ప్రభావం పడుతున్నది. ఇప్పటికే సరికొత్త రికార్డులను నమోదు చేసిన బంగారం.. రోజు రోజుకు మరింత పెరుగుతూ జీవితకాల గరిష్ఠానికి పెరుగుతున్నాయి. తాజాగా మార్కెట్లో మరోసారి ధర స్వల్పంగా పెరిగింది. గురువారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్పై రూ.10 పెరగ్గా.. తులానికి రూ.66,110 ధర పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.10 పెరగడంతో 24 క్యారెట్ల పసిడి రూ.72,120కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,160 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,160కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,110 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,120కి ఎగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,260 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,260 పలుకుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.61,110 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,120 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి సైతం పెరిగింది. వెండి రూ.100 పెరిగి కిలోకు రూ.85,600 ధర పలుకుతుండగా.. హైదరాబాద్లో కిలో ధర రూ.89,100 ధర పలుకుతున్నది. బంగారం, వెండి ధరలు హైదరాబాద్లో ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.