Gold-Silver Rates | పడిసి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజు మంగళవారం బులియన్ మార్కెట్లో ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి తులానికి రూ.66,850కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.220 పెరిగి తులానికి రూ.72,440కి చేరింది. అదే సమయంలో వెండి ధర భారీగా పెరిగింది. ఒకే రోజు ఏకంగా రూ.3500 పెరిగింది.
Gold-Silver Rates | పడిసి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజు మంగళవారం బులియన్ మార్కెట్లో ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి తులానికి రూ.66,850కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.220 పెరిగి తులానికి రూ.72,440కి చేరింది. అదే సమయంలో వెండి ధర భారీగా పెరిగింది. ఒకే రోజు ఏకంగా రూ.3500 పెరిగింది. దీంతో హైదరాబాద్లో కిలో రూ.లక్ష మార్క్ను దాటింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,530కి ఎగిసింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,850 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,930కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,080కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,930 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పెరిగింది. ఒకే రోజు రూ.3500 పెరిగి ఢిల్లీలో రూ.96,500కి చేరింది. ఇక హైదరాబాద్లో హైదరాబాద్లో రూ.1,0,1000కి ఎగిసింది.
వెండి హైదరాబాద్లో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. వద్ద స్థిరంగా ఉన్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.