విజయవాడలో మరో దారుణం చోటుచేసుకుంది.
విధాత:15 ఏళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటను అజిత్ సింగ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో నివాసముండే బాలిక ఓ దుకాణంలో పనిచేస్తూ రోజూ ఆటోలో వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలోనే ఆమెకు ప్రకాష్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ వల్లెపు వసంతకుమార్(19)తో పరిచయం ఏర్పడింది.ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో తన ఆటోలో కొద్ది మంది ప్రయాణికులతో పాటుగా బాలికను ఎక్కించుకుని, […]

విధాత:15 ఏళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటను అజిత్ సింగ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో నివాసముండే బాలిక ఓ దుకాణంలో పనిచేస్తూ రోజూ ఆటోలో వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలోనే ఆమెకు ప్రకాష్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ వల్లెపు వసంతకుమార్(19)తో పరిచయం ఏర్పడింది.ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో తన ఆటోలో కొద్ది మంది ప్రయాణికులతో పాటుగా బాలికను ఎక్కించుకుని, ప్రయాణికులను మాత్రం రాజీవ్ నగర్లో దింపేశాడు.
అనంతరం బాలికను ఎక్సెల్ ప్లాంటు సమీపం వాంబేకాలనీలోని న్యూ జేఎన్ఎన్ఎయూఆర్ఎం అపార్టుమెంట్ల వద్దకు తీసుకెళ్లాడు.నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.బాలికను బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంటి పరిసర ప్రాంతంలో దింపేసి వెళ్లిపోయాడు.ఆ సమయంలో ఇంటికి వచ్చిన బాలికను తల్లి నిలదీయగా..జరిగిన విషయం చెప్పింది.కుటుంబ సభ్యులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అత్యాచారం,పోక్సా యాక్టు ప్రకారం డ్రైవర్ పై కేసు నమోదైంది.బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ లక్ష్మీనారాయణ వివరించారు.