విధాత, ఆరోగ్యం: ఆయుర్వేదంలో మనం రోజూ చూసే, వాడుకునే వస్తువుల్లోని ఔషధ గుణాలను చక్కగా వివరించారు. అలాంటి వాటిలో బాదంపప్పు కూడా ఒకటి. బాదం చెట్టు ఆయుర్వేద వైద్యంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. బాదంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తీపి బాదం, రెండోది సీమ బాదం. అంటే నాటు బాదం. * బాదం పప్పులు 6 తీసుకుని ప్రతి రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున పొట్టు తీసి తినాలి. ఇది మంచి కంటి చూపుకి […]
విధాత, ఆరోగ్యం: ఆయుర్వేదంలో మనం రోజూ చూసే, వాడుకునే వస్తువుల్లోని ఔషధ గుణాలను చక్కగా వివరించారు. అలాంటి వాటిలో బాదంపప్పు కూడా ఒకటి. బాదం చెట్టు ఆయుర్వేద వైద్యంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
బాదంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తీపి బాదం, రెండోది సీమ బాదం. అంటే నాటు బాదం.
* బాదం పప్పులు 6 తీసుకుని ప్రతి రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున పొట్టు తీసి తినాలి. ఇది మంచి కంటి చూపుకి దోహదం చేస్తంది. ఇలా కొన్నిరోజులు వాడితే సైటుకి సంబంధించిన సమస్యలు అన్ని తొలగిపోతాయి.
* బాదంపప్పు అంజీర పండుతో కలిపి తింటె మలబద్ధకం తగ్గుతుంది.
* బాదం చెట్టు యొక్క పచ్చి ఆకులని నూరి ఆ రసాన్ని 3ml పిల్లలకు పట్టిస్తే కడుపులోని నులిపురుగులు నశిస్తాయి.
* బాదం నూనెతో మర్దన చేస్తే శరీరం గట్టి పడుతుంది. కండరాలు బలంగా మారుతాయి.
* బాదం పప్పు మెత్తగా నూరి చర్మ సమస్యలు ఏమున్నా లేపనంగా వాడితే పొడలు, దురద హరించును .
* బాదం నూనె వేడిపాలలో కలుపుకుని తాగుతూ ఉంటే వేడి శరీరం కలవారికి వేడి తగ్గి చలువ చేస్తుంది.
* బాదంపప్పు పై పెంకులని కాల్చి బూడిద చేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ చూర్ణంతో ప్రతిరోజు ఉదయాన్నే పండ్లు తోముకుంటూ ఉంటే దంతాలు గట్టిపడతాయి , దంతాల కుదుళ్ళు బల పడతాయి. చిగుళ్లలో వాపు తగ్గుతుంది. దంతాల మీద మరకలు పోయి తెల్లగా అవుతాయి. నోటిదుర్వాసన కూడా తగ్గుతుంది.
* బాదం నూనె తో తయారుచేసిన సబ్బు వాడితే చర్మం మృదువుగా తయారయి ముఖవర్చస్సు కాంతివంతంగా మారుతుంది.
* బాదంపప్పుతో చేసిన మురబ్బా తింటుంటే శరీరం బలంగా తయారవుతుంది.
* దోశ పిండి తయారు చేసుకునేటపుడు కొద్దిగా బాదం పప్పులు కలిపి ఆ పిండితో దోశలు వేసుకుని తింటే రక్తహీనత తగ్గుతుంది. అతిమూత్రవ్యాధికి కూడా ఇది మంచి విరుగుడు.
* రాత్రి పడుకునే ముందు పది గ్రాముల పటిక బెల్లానికి 6 బాదం పప్పులు కలిపి తీసుకుంటే మెదడుకి , కళ్ళకి విపరీతమైన బలం. నిద్ర లేమికి కూడా ఇది మంచి పరిష్కారం.
* కుక్కకరిచిన వెంటనే బాదం పప్పును అంజీరా కలిపి తిని, బాదంపప్పు నూరిన ముద్దని కరిచిన చోట పెట్టి కట్టుకడితే విషం శరీరంలో త్వరగా వ్యాపించదు.
* మూత్రాశయంలో రాళ్లు ఏర్పడినవారు నిత్యం బాదంపప్పు క్రమం తప్పకుండా తింటే బ్లాడర్ లో రాళ్లు కరిగిపోతాయి. భవిష్యత్తులో మళ్లీ రాళ్లు ఏర్పడవు.
* శరీరంలో గల విపరీతమయిన వేడి తగ్గటానికి 8 బాదం పప్పులు, 8 చిన్న యాలక్కాయలు, సోంపు గింజలు 5 గ్రాములు, 5 ద్రాక్షపండ్లు కలిపి నూరి వడకట్టుకొని వాటికి పటికబెల్లం చేర్చి రెండుపూటలా తీసుకుంటే ఒంట్లోని వేడి తగ్గి, శరీరానికి బలం చేకూరుతుంది.
* ముఖము మీద మచ్చలు పోవడానికి బాదంపప్పును పన్నీటితో మెత్తగా నూరి ఉదయం సాయంత్రం ముఖానికి రాసుకొని 2 గంటల వరకు ఉంచి చల్లని నీటితో కడుక్కోవాలి. శరీరంపైన మచ్చలు పోతాయి. ముఖం నునుపుగా తయరయి మెరుస్తూ ఉంటుంది.