ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు జరిమానా

- తప్పుడు పత్రాలు సమర్పించారన్న ఆరోపణలు
- కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనందుకు కోర్టు ఆగ్రహం
- రూ.10 వేల జరిమానా
విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: ఆలేరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. గత ఎన్నికల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారనే ఆరోపణలపై హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనందుకు ఆమెకు హైకోర్టు మంగళవారం రూ.10 వేల జరిమానా విధించింది. అక్టోబర్ 3లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. అయితే 2018 ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులకు సంబంధించి సునీత తప్పుడు సమాచారం అందించారని, ఆస్తులను చూపలేదని సైని సతీష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా.. తప్పుడు సమాచారం అందించినందుకు ఆమె ఎన్నిక చెల్లదని, అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సునీతను ఆదేశించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.