రోజా, జగన్‌, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్ ఫైర్‌

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ ఏపీ సీఎం జగన్‌, మంత్రి రోజాపైన, కేటీఆర్‌పైన విమర్శలతో విరుచుకపడ్డారు

  • By: Somu    latest    Feb 27, 2024 10:03 AM IST
రోజా, జగన్‌, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్ ఫైర్‌
  • రోజా డైమండ్ రాణి..ఐటం రాణి..పులుసుపాప
  • కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మూడు సీట్లు కూడా రాకపోయేవి
  • రేవంత్ రెడ్డి ఫైటర్‌..జగన్ యాక్సిడెంటల్ సీఎం


విధాత, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ ఏపీ సీఎం జగన్‌, మంత్రి రోజాపైన, కేటీఆర్‌పైన విమర్శలతో విరుచుకపడ్డారు. మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ .రోజా డైమండ్ రాణి…ఐటం రాణి అని ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్‌గా ఉందన్నారు. పులుసు వండిపెట్టింది కాబట్టి రోజాను సీఎం రేవంత్‌రెడ్డి పులుసు పాప అన్నారన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని, ఫైటర్ అని, ఏపీ సీఎం జగన్ ఆక్సిడెంట్ సీఎం అన్నారు. భారతదేశంలో రేవంత్ రెడ్డిలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు.


పోరాడి కష్టపడి తనను తాను ప్రూప్ చేసుకుని రేవంత్‌రెడ్డి సీఎంగా అయ్యారన్నారు. బీఆరెస్‌ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభను అధిగమించి మరీ రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారన్నారు. జగన్ తండ్రి చనిపోతే, ఆ సానూభూతి, వారసత్వంతోనే యాక్సిడెంటల్‌ సీఎం అయ్యారన్నారు. రోజా రేపోమాపో మాజీ అయ్యాక ఇక్కడికి వచ్చి జబర్దస్త్ ఫోగ్రామ్‌లు చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి రోజకు లేదన్నారు. ఇక బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి పేరు అడ్డు పెట్టుకునే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కేసీఆర్ కొడుకుగా తప్ప కేటీఆర్‌కి ఏ గుర్తింపూ లేదన్నారు.


కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందన్నారు. రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ భాధపడుతున్నాడన్నారు. కేటీఆర్ రాజకీయ పరంగా డిజాస్టర్ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్‌‌ని తిట్టిస్తున్నారన్నారు. కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారన్నారని ఎద్దేవా చేశారు. మేం ఆరు గ్యారంటీలతో పాటు స్వేచ్ఛ అనే 7వ గ్యారెంటీ ఇచ్చామన్నారు. మీ హయాంలో సీఎంకు చెప్పు చూపిస్తే ఎన్‌కౌంటర్ చేయించే వాళ్లని.. రాళ్లతో కొట్టి చంపించే వాళ్లన్నారు. కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 3 సీట్లు కూడా రాకపోయేవని బండ్ల గణేష్ అన్నారు.


ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారన్నారు. కేటీఆర్ హయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం దొరుకుతోందన్నారు. మేడిగడ్డకి వెళ్లి బీఆరెస్ నాయకులు ఏం చేస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డను ఎలా నాశనం చేశారో చూసి వస్తారా? అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. మేడిగడ్డ కూలిపోతే మాదే బాధ్యత అని బీఆరెస్ నాయకులు చెప్పాలన్నారు. పనికిరానప్పుడు తీసేయడం తప్ప ఏం చేస్తారని ప్రశ్నించారు. మూడు పిల్లర్లు ముప్పై పిల్లర్లు కాకుండా కాపాడుతున్నామని బండ్ల గణేష్ పేర్కొన్నారు.