జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నేడు బుధవారం తెలంగాణ గవర్నర్గా అదనపు బాధత్యలు స్వీకరించనున్నారు
విధాత, హైదరాబాద్: జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రేపు బుధవారం తెలంగాణ గవర్నర్గా అదనపు బాధత్యలు స్వీకరించనున్నారు. గవర్నర్ తమిళి సై రాజీనామా నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్ను తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్గా రాష్ట్రపతి భవన్ నియమించింది. మంగళవారం రాత్రి రాధాకృష్ణన్ హైదరాబాద్కు చేరుకుంటారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించనున్నారు.
గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో రాజ్భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇంచార్జి లెఫ్ట్నెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కోంది. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్ను కోరింది. బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమలులోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ తన ప్రకటనలో తెలిపింది.