విధాత:కేసీఆర్ బినామీ ల కోసమే భూముల అమ్మకాలు..HMDA అమ్మిన భూములు కోకాపేట గ్రామంలో ఉన్నాయి.గతంలో కూడా రియల్ భూమి పెరినట్లు ప్రచారం చేశారు- రియల్ భూమ్ కోసమే అమ్ముతున్నట్లు ఉంది.ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానల కోసం స్థలం కూడా ఉండదన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి వెళ్తే కేసీఆర్-హరీష్ రావు- కేటీఆర్ అడ్డుకోని నానా రచ్చ చేశారు.ఈ- ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయి.రమేశ్వర్ రావు […]
విధాత:కేసీఆర్ బినామీ ల కోసమే భూముల అమ్మకాలు..HMDA అమ్మిన భూములు కోకాపేట గ్రామంలో ఉన్నాయి.గతంలో కూడా రియల్ భూమి పెరినట్లు ప్రచారం చేశారు- రియల్ భూమ్ కోసమే అమ్ముతున్నట్లు ఉంది.ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానల కోసం స్థలం కూడా ఉండదన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి వెళ్తే కేసీఆర్-హరీష్ రావు- కేటీఆర్ అడ్డుకోని నానా రచ్చ చేశారు.ఈ- ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయి.రమేశ్వర్ రావు కంపెనీలు 18 ఎకరాలు కొన్నది.- సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి సంస్థ రాజ్ పుష్ప 7 ఎకరాలు కొన్నది.ఆక్వా స్పెస్ సంస్థకు 390 కోట్లు- రాజ్ పుష్ప సంస్థకు 138 కోట్లు లాభం గడించాయి.3వేల కోట్లు రావాల్సిన భూములను- 2వేల కోట్లకే పరిమితం చేశారు.ప్రెస్టీజి సంస్థకు- మంత్రి కేటీఆర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయి.సోమేశ్ కుమార్- కేటీఆర్ లంచాలు తీసుకోని భూముల గోల్ మాల్ చేశారు.50 ఎకరాలు ఉన్న భూమి ఒకరానికో రేటు ఎలా ఉంటుంది? ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు 60 కోట్లు- మిగిలిన 48 ఎకరాలు 30 నుంచి 40 కోట్లకు ఎలా ధర పలుకుతుంది.సిద్దిపేట కలెక్టర్ మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా ఫోన్ చేసి బెదిరించారు.టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వమని హెచ్చరించారు.టీఆరెస్- కేసీఆర్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారు!. కోకాపేట లో 50 కోట్లకు తక్కువ ధర లేదు.అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల లూటీ జరిగింది.గతంలో లిక్కర్ మాఫియా లెక్క- ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపింది.60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమినంతా మళ్ళీ టెండర్లు పిలువాలి.స్విచ్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలువాలి.రాజ్ పుష్ప సంస్థ నిబంధనలకు విదంగా రియలేస్టేట్ వ్యాపారం చేస్తోంది.త్వరలోనే రాజ్ పుష్ప సంస్థ- వెంకట్రామిరెడ్డి భాగోతం బయపెడుతా!. ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడీ పరాకాష్టకు చేరుకుంది.తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు కేసీఆర్ కు లేదు.భూ అమ్మకాల్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది.నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రి- ప్రధానికి ఫిర్యాదు చేస్తాకిషన్ రెడ్డి కి కూడా నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తా! నేను ఇచ్చే ఫిర్యాదు పై కేంద్రం- బీజేపీ విచారణకు అదేశిస్తుందా లేదా చూద్దాం!టీఆరెస్- బీజేపీ రహస్య ఒప్పందం ఏంటో తెలుస్తుంది భూ ఆక్రమణల పై పార్లమెంట్ లో మాట్లాడుతా తెలంగాణ రాష్ట్ర విభజన పై – కృష్ణా జలాల పై పార్లమెంట్ లో పోరాటం చేస్తాం