Harish Rao | రుణమాఫీకి వడ్డీకి లింక్.. సమస్య పరిష్కారించాలని సీఎంకు హరీశ్రావు ట్వీట్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ గందరగోళంగా మారిపోయిందని, వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు లింక్ పెడుతున్నారని, తక్షణమే సీఎం రేవంత్రెడ్డి ఈ సమస్యను పరిష్కరించాలని మాజీ మంత్రి టి.హరీశ్రావు ట్వీట్ చేశారు

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ గందరగోళంగా మారిపోయిందని, వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు లింక్ పెడుతున్నారని, తక్షణమే సీఎం రేవంత్రెడ్డి ఈ సమస్యను పరిష్కరించాలని మాజీ మంత్రి టి.హరీశ్రావు ట్వీట్ చేశారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ… pic.twitter.com/MdHZsSeOcO
— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2024
ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్ను రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాననంటూ ట్వీట్ ఫోటోలతో సీఎంవోకు ట్యాగ్ చేశారు.