లోక్ సభ ఎన్నికలలో అబ్ కీ బార్.. చార్ సౌ పార్ నినాదంతో బీజేపీ పార్టీని 400 సీట్లలో గెలిపించాలంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఎద్దేవా చేస్తూ బీఆరెస్ రూపొందించిన ప్రచార వీడియోతో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
బీఆరెస్ ఎన్నికల ప్రచారంతో కేటీఆర్ ట్వీట్
విధాత : లోక్ సభ ఎన్నికలలో అబ్ కీ బార్.. చార్ సౌ పార్ నినాదంతో బీజేపీ పార్టీని 400 సీట్లలో గెలిపించాలంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఎద్దేవా చేస్తూ బీఆరెస్ రూపొందించిన ప్రచార వీడియోతో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ వ్యక్తి కలలో తన ద్విచక్ర వాహనంతో పెట్రోల్ బంక్కు వెళ్లగా, సిబ్బంది లీటర్ పెట్రోల్ ధర 400అని చెప్పడంతో అతను అవాక్కై నిద్ర నుంచి మేల్కోని అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అంటే లీటర్ పెట్రోల్ నాలుగు వందలా అని ఆశ్చర్యపోతాడు.
ఈ ప్రచార వీడియోను కేటీఆర్ ట్విటర్లో షేర్ చేసి పెట్రోల్ ధరలతో ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తున్న కాషాయపార్టీకి అబ్ కా బార్ చార్ సౌ పార్ అని నమ్మి ఓటెస్తే ఇగ ఆగమే అని హెచ్చరించారు. చార్ సౌ అనేది సీట్ల గురించి కాదు పెట్రోల్ రేట్ల గురించి అని, 2014లో 70, 2024లో 110, 2029లో 400రూపాయలంటూ ట్వీట్ చేశారు.