బుద్ధుడి స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తానని సీఎం రేవంత్రెడ్డి పేర్కోన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా గురువారం సికింద్రాబాద్ళోని మహాబుద్ధ విహార ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.
బుద్ధ పూర్ణిమలో పాల్గొన్న సీఎం
విధాత, హైదరాబాద్: బుద్ధుడి స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తానని సీఎం రేవంత్రెడ్డి పేర్కోన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా గురువారం సికింద్రాబాద్ళోని మహాబుద్ధ విహార ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ బుద్ధ విహార సందర్శనతో గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందన్నారు. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారన్నారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని కొనియాడారు.
ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉందని, ఈ సూక్తి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానని, ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తానన్నారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయని, స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉందని, బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమన్నారు. బుద్దుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తిగా, ప్రభుత్వంగా చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం మీది… అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని, తెలంగాణలో బుద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఒక పాఠశాలను నిర్వహించాలని కోరారు.