విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ టికెట్ కావాలనుకుంటే వారం రోజుల్లోగా ఆశావహులు తనకు 10వేలు గుగూల్పే చేసి, దరఖాస్తు పంపాలని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇప్పటికే పార్టీ తరుపున పోటీ చేసేందుకు 3వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వారం రోజుల్లోగా అభ్యర్థుల జామితా ఖరారు చేస్తామన్నారు.
ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, మహిళలకు 33శాతం బీసీలకు 60శాతం టికెట్లు ఇస్తామని, సీఎంగా బీసీని చెద్దామని, ఇందుకు ప్రజాశాంతి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నవంబర్ 30న సీఎం కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాలని కోరారు.