MLC Kavitha | కవిత కేసు విచారణ 12కు వాయిదా.. డిఫాల్ట్ బెయిల్‌కు కవిత పిటిషన్‌

ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణ 12వ తేదీకి వాయిదా పడింది

MLC Kavitha | కవిత కేసు విచారణ 12కు వాయిదా.. డిఫాల్ట్ బెయిల్‌కు కవిత పిటిషన్‌

విధాత : ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణ 12వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో సోమవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సీబీఐ జూన్ 7న వేసిన ఛార్జి‌షీట్‌లో తప్పులు ఉన్నాయని, నిర్ణీత వ్యవధి(కేసుల తీవ్రత మేరకు 60నుంచి 90రోజులు)లోగా సీబీఐ దర్యాఫ్తు పూర్తి చేయలేకపోయిందని తమ క్లయింట్ కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అందుకే ఎమ్మెల్సీ కవితను రిలీజ్ చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సీబీఐ రీఫైలింగ్ చేసిన ఛార్జిషీట్‌లోనూ తప్పులు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీంతో వచ్చే గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై శుక్రవారం రోజున విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, తీహార్ జైలులో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు నుంచి జైలులోనే ఉన్న కవితకు బెయిల్ మాత్రం లభించడం లేదు. దీంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు.