ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
విధాత : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆరెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలో నిలిచారని, ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి, రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
అందుకే దానంపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే దానంపై అనర్హత వేటు వేయాలని బీఆరెస్ఎల్పీ బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారడంతో బీఆరెస్ నాయకత్వం ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయగా, దానం కూడా ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు దీంతో దానంపై అనర్హత వేటు విషయమై బీఆరెస్ నాయకత్వం పట్టుదలతో ముందుకెలుతుంది.