సీఎం రేవంత్ రెడ్డి మొదటి నెల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్

పదేళ్ల బీఆ­రెస్‌ ప్రభు­త్వాన్ని గద్దె దించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర పగ్గా­లను స్వీక­రించి ఆది­వా­రంతో సరిగ్గా నెల­రో­జులు అవు­తు­న్నది

సీఎం రేవంత్ రెడ్డి మొదటి నెల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్
  • ఖ‌జానా ఖాళీ అని చెప్ప‌­డంలో స‌క్సెస్‌
  • అయినా మొద‌టి వారంలో జీతాలు
  • కాళే­శ్వ‌రం ప్రాజె­క్టులో అవి­నీ­తిపై క‌ద‌­లిక‌
  • ప్రమాణం అనం­త­రమే 2 హామీల అమ‌లు
  • మిగ‌తా హామీ­ల‌కు ద‌ర‌­ఖా­స్తుల స్వీక‌­ర‌ణ‌

విధాత‌, హైద‌­రా­బాద్‌: పదేళ్ల బీఆ­రెస్‌ ప్రభు­త్వాన్ని గద్దె దించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర పగ్గా­లను స్వీక­రించి ఆది­వా­రంతో సరిగ్గా నెల­రో­జులు అవు­తు­న్నది. అంచనా వేయ­డా­నికి తక్కువ కాలమే అయినా.. తొలి అడు­గు­లను బట్టి మలి అడు­గు­లను అంచనా వేయాల్సి వస్తే రాష్ట్రంలో ఒక ఆశా­వహ వాతా­వ­రణం నెల­కొ­న్న­దనే అభి­ప్రా­యాలు వ్యక్త­మ­వు­తు­న్నాయి. ప్రత్యే­కించి గడీ పాల­నకు నిద­ర్శ­నంగా చెబుతూ వచ్చిన ప్రగ­తి­భ­వ­న్‌ను ప్రజ­లకు చేరువ చేయడం ద్వారా తమది ప్రజా పాలన అని చాటు­కో­వ­డా­నికి కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నం ఫలిం­చిం­దనే అను­కో­వాలి. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోపల ఎలా ఉంటుందో కూడా తెలి­య‌ని ప్ర‌జ‌­ల‌కు అక్క­డికి వెళ్లి తమ సమ­స్య­లను విన్న­విం­చు­కునే అవ­కాశం కల్పిం­చింది.


ఎవ‌రు ఏ రూపంలో ద‌ర‌­ఖా­స్తులు ఇచ్చినా స్వీక‌­రించి ప‌రి­శీ­లించి స‌మ‌­స్య‌ను ప‌రి­ష్క­రి­స్తా­మ‌­న్న­ధీమా క‌లి­గేలా చేయ­గ­లి­గింది. జిల్లాల్లో ప్రజా­వాణి కార్య­క్ర­మా­లతో మంత్రులు సైతం అందు­బా­టులో ఉంటు­న్నా­రనే అభి­ప్రాయం నెల­కొ­న్నది. ఇక ప్రమాణం స్వీక­రిం­చిన వెంటనే రెండు గ్యారెం­టీ­లను అమలు చేసిన ప్రభుత్వం.. మిగి­లి­న­వాటి కోసం కొత్త లబ్ధి­దా­రు­ల­నుంచి దర­ఖా­స్తు­లను ఆహ్వా­నిం­చింది. దీంతో ప్రత్యే­కించి రేష­న్‌­కా­ర్డు­దా­రులు పెద్ద సంఖ్యలో దర­ఖా­స్తులు చేసు­కు­న్నారు. మరో­వైపు తొలి సమీక్షా సమా­వే­శం­లోనే రాష్ట్రం అప్పుల చిట్టా తెరి­పించి.. తొలి అసెంబ్లీ సమా­వే­శం­లోనే ఆర్థిక పరి­స్థి­తిపై శ్వేత­ప­త్రాన్ని విడు­దల చేయడం ద్వారా బీఆ­రెస్‌ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిం­దనే వాస్త­వాన్ని ప్రజ­ల్లోకి తీసు­కె­ళ్ల­గ­లి­గింది. ఇదే సమ­యంలో తాము అమలు చేయా­ల­ను­కున్న పథ­కా­లకు నిధుల లోటు అనేది గత ప్రభుత్వ పాప­మే­నని చెప్పు­కొ­నేం­దుకు ప్రయ­త్నిం­చింది.

రేవంత్ రెడ్డి ముఖ్య‌­మం­త్రిగా ప్ర‌మాణం చేసిన వెంట‌నే స‌చి­వా­ల‌యం కేంద్రంగా ప‌రి­పా­లన మొద‌లు పెట్టారు. జెట్ స్పీడ్‌తో నిర్ణ‌­యాలు తీసు­కు­న్నారు. ఎన్ని­క‌ల్లో ప్ర‌క‌­టిం­చిన విధంగా ఆరు గ్యారెం­టీల అమ‌­లును వెంటనే మొద‌లు పెట్టా­ల‌ని భావిం­చినా ఖ‌జానా ఖాళీగా క‌ని­పిం­చ‌­డంతో వెంట‌నే శ్వేత ప‌త్రం విడు­ద‌ల చేయా­ల‌ని నిర్ణ‌­యిం­చారు. శాఖ­ల­వా­రీగా సమీ­క్షలు నిర్వ‌­హించి రాష్ట్ర ప్ర‌భు­త్వా­నికి రూ.ఆరు­న్న‌ర ల‌క్ష‌ల కోట్ల అప్పులు ఉన్నట్టు అసెం­బ్లీలో బయ­ట­పె­ట్టారు. ఎన్ని­క‌లు ముగి­య­గానే డిసెం­బ‌ర్‌ 9వ తేదీన సోని­యా­గాంధీ జ‌న్మ‌­దినం రోజున రైతు­భ­రోసా, రుణ­మాఫీ డబ్బు ఖాతాల్లో వేస్తా­మ‌ని పీసీసీ అధ్య­క్షుడి హోదాలో ప్రక­టిం­చిన రేవం­త్‌­రెడ్డి.. తీరా ముఖ్య­మంత్రి అయ్యాక వాటిపై ముంద­డుగు వేయ­లేదు.


బీఆ­రెస్ స‌ర్కారు రైతు బంధు నిధులు ఖ‌జా­నాలో ఉంచిం­ద‌ని భావిం­చిన రేవం­త్‌కు.. సీఎంగా బాధ్య­తలు తీసు­కున్న తర్వాత నిర్వ­హిం­చిన సమీక్షా సమా­వే­శంలో కానీ అసలు సంగతి బోధ­ప­డ­లేదు. ఖజానా ఖాళీగా ఉన్న­దని ఆర్థిక శాఖ అధి­కా­రులు స‌మా­ధానం ఇవ్వ‌­డంతో ఆశ్చ‌­ర్య­పో­వ‌డం రేవంత్ రెడ్డి వంతైంది. అయితే డిసెం­బ‌ర్ 9వ తేదీన ఖాతాల్లో డ‌బ్బులు ప‌డ‌­క‌­పో­యినా, రైతుల రుణం మాఫీ కాక‌­పో­యినా ప్ర‌జ‌లు ప‌రి­స్థితి బాగా లేదు కాబ‌ట్టి వేయ‌­లే­ద‌ని భావిం­చారు. దీనిపై ఎక్క‌డ కూడా విమ‌­ర్శ‌లు రాలేదు. కానీ ప్ర‌భుత్వం ఏర్ప‌­డిన వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌­టిం­చిన ఆరు గ్యారెం­టీల అమ‌­లుకు రోడ్ మ్యాప్ ప‌డ‌క పోతే మాత్రం వ్య‌తి­రే­కత వ‌చ్చే ప్ర‌మాదం ఉందని రాజ­కీయ విశ్లే­ష­కులు వ్యాఖ్యా­ని­స్తు­న్నారు.

ద్విముఖ వ్యూహంతో రేవంత్‌

సీఎంగా బాధ్య‌­త‌లు స్వీక‌­రిం­చిన రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళు­తు­న్నా­ర‌ని స్ప‌ష్ట­మ­వు­తు­న్నది. ఒక‌టి బీఆ­రెస్ చేసిన అప్పు­ల‌ను వెల్ల‌­డిం­చ‌­డంతో పాటు బీఆ­రెస్ అధి­నేత కేసీ­ఆ­ర్‌తో, మంత్రులు, ఎమ్మె­ల్యేల అవి­నీతి, భూ క‌బ్జా­ల‌ను బ‌య‌ట పెట్టా­ల‌ని నిర్ణ‌­యిం­చి­న‌ట్లు తెలు­స్తోంది. ఇందులో భాగం­గానే ల‌క్ష కోట్ల అవి­నీతి అంటూ ఎన్ని­క‌ల్లో ప్ర‌ధాన ప్ర‌చా­రా­స్త్రంగా తీసు­కున్న కాళే­శ్వ‌రం ప్రాజె­క్టు­పైనే మొద‌టి విచా­ర‌­ణ‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ­మైంది. ఈ మేర‌కు సాగు­నీటి పారు­ద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమా­ర్‌­రెడ్డి త‌న స‌హ‌­చ‌ర మంత్రు­ల‌తో క‌లిసి మేడి­గ‌డ్డ బరా­జ్‌ను ప‌రి­శీ­లిం­చారు. అక్క‌డే ఈఎన్సీ చేత ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జం­టే­ష‌న్ ఇప్పిం­చారు.


18 ల‌క్ష‌ల ఎక‌­రాల ఆయ‌­క‌­ట్టుకు ప్ర‌తి­పా­దిం­చిన ఈ ప్రాజె­క్ట్‌లో కేవ‌లం 90 వేల ఎక‌­రా­ల‌కే సాగు నీళ్లు ఇస్తున్న‌ వాస్తవం ఈ సంద­ర్భంగా బయ­ట­ప­డింది. దీంతో కాళే­శ్వ‌­రంపై ఉన్న భ్రమలు తొల‌­గి­పో­యాయి. కాళే­శ్వ‌రం అక్ర‌­మా­ల‌పై జ్యుడి­షి­య‌రీ ఎంక్వై­రీకి ఆదే­శి­స్తు­న్న‌ట్లు మంత్రి ప్ర‌క‌­టిం­చారు. ఈ విచా­ర‌ణ ద్వారా గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పు­ల‌ను ప్ర‌జ‌­ల‌కు తెలి­య‌­జేసే అవ‌­కాశం ఉంటుంది. ఇలా విద్యుత్తు కుంభ­కో­ణా­ల­పైనా విచా­ర‌ణ చేస్తా­మ‌ని సీఎం రేవంత్ రెడ్డి అసెం­బ్లీలో ప్ర‌క‌­టిం­చారు. ధ‌ర‌ణి అక్ర‌­మా­లపై నిగ్గు తేలు­స్తా­మ‌న్న రేవంత్ రెడ్డి ఈ మేర‌కు కార్యా­చ‌­ర‌­ణను సిద్ధం చేస్తు­న్నారు. ధ‌ర­ణిని ర‌ద్దు­చేసి, దాని స్థానంలో కొత్త వ్య‌వ‌­స్థ‌ను తీసుకు వ‌చ్చే దిశ‌గా అడు­గు­లే­స్తు­న్నారు.

తక్షణ ఆర్థిక భారం లేనివే తొలి రెండు గ్యారెం­టీలు

గ‌త‌ ప్ర‌భుత్వ వైఫ‌­ల్యా­ల‌ను ఎండ గ‌ట్టి­నంత మాత్రాన ఇచ్చిన హామీ­ల‌ను అమ‌లు చేయ‌­క‌­పోతే ప్ర‌జ‌లు న‌మ్మ‌­ర‌ని గుర్తిం­చిన రేవంత్ రెడ్డి మొద‌టి రోజే ఆరు గ్యారెం­టీల అమ‌­లుకు క్యాబి­నె­ట్‌లో ఆమోదం తీసు­కు­న్నారు. ఆ వెంట‌నే ఇందులో ఆర్థి­కంగా వెంట‌నే బ‌డ్జె­ట్‌పై భారం ప‌డ‌ని మ‌హి­ళ‌­ల‌కు ఆర్టీ­సీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఆరో­గ్య‌శ్రీ పరి­మితి రూ.10 ల‌క్ష‌­ల‌కు పెంపును వర్తింప చేశారు. మిగి­లిన నాలుగు ప‌థ‌­కాల అమ‌­లుకు శ్రీ‌కారం చుట్ట‌డం కోసం నెల రోజు­ల‌­లోపే దర‌­ఖా­స్తుల స్వీక‌­ర‌ణ మొద‌లు పెట్టారు. గ్రామ­గ్రా­మా­నికీ ప్ర‌జా పాల‌న పేరుతో రూ.500 గ్యాస్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత క‌రెంటు బిల్లు, రైతు భ‌రోసా, వివిధ ర‌కాల సామా­జిక పెన్ష‌న్లు, రేష‌న్ కార్డు­ల‌కు దర‌­ఖా­స్తు­ల‌ను స్వీక‌­రిం­చారు. దాదాపు కోటి వ‌ర‌కు ద‌ర‌­ఖా­స్తులు వ‌చ్చా­యని సమా­చారం. ఈ ధ‌ర‌­ఖా­స్తు­ల‌ను ప‌రి­శీ­లించి, ఫైన‌ల్ చేసి వెంట‌నే ప‌థ‌­కా­ల‌ను అమ‌లు చేయా­ల‌న్న ఆలో­చ‌­న‌లో ఉన్న‌ట్లు తెలు­స్తోంది. ఇందులో భాగం­గానే సీఎస్ శాంతి కుమారి ఇప్ప‌­టికే ఈ నెల 17వ తేదీ­లోగా ద‌ర‌­ఖా­స్తుల పరి­శీ­ల‌న పూర్తి కావా­ల‌ని ఆదే­శిం­చారు.


పార్ల­మెంటు షెడ్యూల్‌ లోపే నాలుగూ వస్తాయా?

ఫిబ్ర‌­వరి మొద‌­టి­వా­రంలో లోక్‌­సభ ఎన్ని­క­లకు షెడ్యూల్ విడు­ద‌­ల‌య్యే అవ‌­కాశం ఉందని సంకే­తాలు వస్తు­న్నాయి. అంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈలోపే మిగి­లిన నాలుగు గ్యారెం­టీ­లనూ ప్రజ­లకు అందిం­చాల్సి ఉన్నది. లేకుంటే లోక్‌­సభ ఎన్ని­కల్లో ప్ర‌జ‌ల తీర్పు మ‌రోలా ఉండే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌­థ్యంలో ఏంచే­సైనా స‌రే ప‌థ‌­కాలు గ్రౌండింగ్ చేయా­ల‌న్న ధృఢ నిశ్చ‌­యంతో కాంగ్రెస్ స‌ర్కారు ఉన్న‌ట్లు తెలు­స్తోంది. ఈ నెల రోజుల పాల‌­న‌లో రెండు ప‌థ‌­కాలు అమ‌­లు­లోకి వ‌చ్చినా.. మిగ‌తా వాటికి దర‌­ఖా­స్తులు స్వీక‌­రిం­చ‌­డంతో అమ‌లు చేస్తా­ర‌న్న భ‌రోసా క‌లి­గింది. కానీ షెడ్యూల్ వ‌చ్చే­లోగా అమ‌­లు­లోకి రాక‌­పోతే ప్ర‌జ‌ల న‌మ్మ‌కం కోల్పోయే అవ‌­కాశం ఉంద‌ని రాజ‌­కీయ ప‌రి­శీ­ల‌­కులు చెబు­తు­న్నారు.