పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు సంబంధించి వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడైన అంచనాలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు.
విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు సంబంధించి వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడైన అంచనాలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా కేంద్రంలో కాంగ్రెస్- ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వంలో తెలంగాణకు నాలుగు కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12సీట్లు గెలవబోతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొందన్న అంచనాలు సరికాదని, స్వయంగా బీజేపీ జాతీయ అధ్యుక్షుడు జేపీ నడ్డానే తెలంగాణలో బీజేపీ నాలుగైదు సీట్లు వస్తాయని చెప్పిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.