జనసేనలోకి అంబటి రాయుడు..పవన్ కల్యాణ్‌తో భేటీ

జనసేనలోకి అంబటి రాయుడు..పవన్ కల్యాణ్‌తో భేటీ

 టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఆయన జనసేనలో చేరనున్నారు. ఇటీవలే సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు పదిరోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా ఐసీఎల్ క్రికెట్ టొర్నమెంట్ కోసం తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. ఇంతలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారని, గుంటూరు ఎంపీగా పోటీ చేయవచ్చని తెలుస్తుంది.