హైదరాబాద్ పరిధిలో ఫ్రీ లాంచ్ పేరుతో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీ లేక్ వ్యూ పేరుతో భారీ మోసం బయటపడింది.
చైర్మన్, ఎండీ, సీఈవోల అరెస్టు
విధాత : హైదరాబాద్ పరిధిలో ఫ్రీ లాంచ్ పేరుతో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీ లేక్ వ్యూ పేరుతో భారీ మోసం బయటపడింది. భారతీ బిల్డర్ చైర్మన్ ధూపాటి నాగరాజుతో పాటు ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహారావులను పోలీసులు అరెస్టు చేశారు. కొంపల్లిలో భారతీ ఫ్రీ లాంచ్ పేరుతో అతితక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ 350మంది నుంచి 80 కోట్ల వరకు వసూలు చేశారు. డబ్బులు వసూలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో మోసపోయమని గ్రహించిన భారతీ బిల్డర్స్ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.