పదేళ్లు దేశాన్ని పాలించిన ప్రధాని నరేంద్ర మోదీ తను చేసిన మంచి పనులేమి లేకనే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో రాముడి జపం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు
ముస్లింలపై విద్వేషం సరైంది కాదు
కేసీఆర్ అవినీతికి ఎంత పెద్ద శిక్ష వేసినా చాలదు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
విధాత: పదేళ్లు దేశాన్ని పాలించిన ప్రధాని నరేంద్ర మోదీ తను చేసిన మంచి పనులేమి లేకనే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో రాముడి జపం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు.
ఓట్ల కోసం దేశంలో మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఇస్తామన్న ఉద్యోగాలు, నల్లధనం ప్రజల ఖాతాల్లో వేయడం వంటి హామీలు అమలు చేయలేదన్నారు.
ఈ దేశంలో 25 కోట్ల జనాభా ఉన్న ముస్లింలలో అనేక మంది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, అనేక మంది ముస్లింలు ఆర్మీలో ఉండి దేశం కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారన్నాని గుర్తు చేశారు. ఓట్ల కోసం, అధికారం కోసం ఎందుకు వారిని ఇబ్బంది పెడుతున్నారని మోదీని ప్రశ్నించారు. 25 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకు వస్తే ఏం జరుగుతో తెలుసా? ఆర్మీ కూడా నియంత్రించలేదన్నారు. అందుకే ప్రజలు లౌకికవాద కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో నియంతృత్వం సాగుతుందన్నారు. 2029లో అసలు దేశంలో ఎన్నికలనేవే లేకుండా చేస్తారని ఆరోపించారు.
పార్లమెంటు ఎన్నికల్లో మా టార్గెట్ ఎన్డీయే కూటమి అని.. తెలంగాణాలో బీఆరెస్తో కాకుండా బీజేపీతో తమ ఫైట్ సాగుతుందన్నారు. కనీసం 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందన్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ సాగించిన అవినీతి, నియంతృత్వ పాలనకు ఎంత పెద్ద శిక్ష విధించిన తప్పులేదన్నారు. కాళేశ్వరం నుంచి లిక్కర్ వరకు అన్నింటిలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ బందువులలో ఎవరూ రూ.5వేల కోట్లకు తక్కువ లేరని ఆరోపించారు. సంతోష్ రావు బినామీల పేరుతో టానిక్ చైన్ షాప్ పెట్టి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కుమూడు నాలుగు ఏయిర్ కండీషన్ ఇన్నోవా కార్లు కోనిచ్చాడని ఇలాంటి అవసరంలేదని.. వృధా ఖర్చులన్ని తగ్గించుకుంటూ వెళ్లాల్సివుందన్నారు.
తెలంగాణపై ఏడు లక్షల కోట్ల అప్పును కేసీఆర్ మోపాడన్నారు. పాత అప్పులు చెల్లిస్తునే కొత్తగా అప్పులు పెరగకుండా దుబారా ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరముందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమకాలంలో, రెండు పర్యాయాలు ఆయన గెలిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లోపించిందని, రెండోసారి ప్రభుత్వంలో కూడా మాదిగలకు కేసీఆర్ చొటివ్వలేదన్నారు. ధరణి పేరు మీద వేల ఎకరాలు ఆక్రమించి, కాళేశ్వరం ప్రాజెక్టుతో వేలకోట్ల దోచుకున్నారని విమర్శించారు.
బతుకమ్మ బతుకమ్మ అంటే అందరూ చుట్టు తిరిగి ఆటపాటతో పండగ చేసుకున్నారని, పూల లోపల బాటిల్ ఉంటదని మహిళలు తెల్వదని కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్పై వ్యంగ్యాస్త్రాలు వేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఆర్ఆర్ టాక్స్ అంటూ విమర్శలు చేస్తున్నారని, మాది ఆర్ఆర్ కాదు మీదే ఏఏ అదానీ అంబానీ విధానమని, వారు తప్ప బీజపీ పాలనలో ఎవరు బాగుపడరని వెంకట్రెడ్డి విమర్శించారు.