బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్లపై బంగారంపై రూ.10 పెరిగి తులానికి రూ.58,010 పలుకుతున్నది
Gold Rates | బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్లపై బంగారంపై రూ.10 పెరిగి తులానికి రూ.58,010 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 పెరిగి తులానికి రూ.63,240కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,510 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,830కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,010 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,240కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,160 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,340కి చేరింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.58,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,240 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పడిపోయింది. కిలోకు రూ.1000 తగ్గి కిలో రూ.73,500కి తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.75వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.