లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
♦ లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం కండి
♦ గులాబీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిన నియోజకవర్గాలకు మాజీ ఎమ్మెల్యేలే ఇంచార్జీలుగా ఉంటారని తెలిపారు.
జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. లోక్ సభ ఎన్నికలకు ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో బిజెపి నుంచి ధీటైన పోటీతో పాటు అధికార కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందన్నారు.
నిరాశ వద్దని లోక్ సభ ఎన్నికల్లో తిరిగి పుంజుకుని సత్తా చాటేందుకు క్యాడర్ కృషి చేయాలి అన్నారు. రాష్ట్రంలో అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక తంటాలు పడుతుందన్నారు . ప్రజల్లో క్రమంగా ప్రభుత్వంపై భ్రమలు తొలిగే పరిస్థితి ఉందని.. పార్లమెంటు ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ కు ప్రజా మద్దతు కూడా కట్టుకోవాలని కేడర్ కు సూచించారు.
సమావేశ అనంతరం పార్టీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలలో పోటీకి సిద్ధం కావాలని కేటీఆర్ ఆదేశించారని అందుకు సన్నాహాలు ప్రారంభించామని తెలిపారు.