నోరు జారారా? లేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద నాయకుడై పోతానని అనుకున్నారా? క్యాడర్లో జోప్ నింపబోయారా? ఏదైతేనేం.. బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన విధ్వంసకర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సింగరేణి ఆఫీసు కాలబెట్టాలని, రైల్వే లైన్లు కోసేయాలని పిలుపునివ్వడం బీఆరెస్ అధినాయకత్వాన్ని డిఫెన్స్లో పడేసింది.
విధాత ప్రత్యేకం
మొన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న వరంగల్ కాంగ్రెస్లోని వైరి వర్గాలు ఆత్మీయ సమావేశం పేరిట ముచ్చట్లాడుకుని.. కలిసి భోజనం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తమ మధ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు కలిశారా? అధిష్ఠానం వార్నింగ్తో సమావేశమయ్యారా? లేక ఇలానే తిట్టుకుంటూ అభివృద్ధిని విస్మరిస్తే జనం ఓడిస్తారని భయపడ్డారా? కారణం ఏదైనా.. పార్టీ కింది స్థాయి క్యాడర్లో మాత్రం ఈ పరిణామం సానుకూలతను కలిగిస్తున్నది.
విధాత ప్రత్యేకం
పదేండ్లలో ప్రజావ్యతిరేకతను చవిచూసి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి పట్టు సాధించేందుకు గట్టి ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ దఫా వ్యూహాత్మకంగా ప్రాంతాలను ఎంచుకుని, ఉమ్మడి జిల్లాలవారీగా పావులు కదుపుతోంది.
తెలంగాణ
రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో వెంటాడి వేటాడుతామని పోలీసులు గతంలో ప్రకటించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ను పట్టుకోవడంలో ఈ ఆధునిక సాంకేతిక పనిచేయడం లేదా? లేక ఉద్దేశపూర్వకంగానే ప్రజలను మభ్యపెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భగీరథ్పై పోక్సో కేసు నమోదై వారం దాటినా ఇంతవరకు పట్టుకోలేకపోయారంటే తెర వెనుక ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అంశం ప్రజల చర్చల్లో చోటు చేసుకుంటున్నది.
విధాత ప్రత్యేకం