Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

అప్పుల ఊబిలో పౌరసరఫరాల కార్పొరేషన్.. మొత్తం రుణభారం ఎంతో తెలుసా?

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ రుణాలు కేవలం రూ.4,747 కోట్లు మాత్రమే. ఆ తరువాత 2019-20 రుణ భారం రూ.11,819 కోట్లకు చేరుకున్నది. ఇక్కడి వరకు పర్వాలేదు. కాని 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అది ఏకంగా రూ.58,623 కోట్లకు పెరిగి పెను భారంగా మారింది

ప్రమాద ఘటన పై తిరగబడ్డ జనం

రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులపై ప్రజలు తిరగబడ్డారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వారు నిలదీశారు. ప్రజల నుంచి ఇలాంటి ప్రతిఘటన వస్తుందని వారు ఊహించలేకపోయారు.

గాలికి వదిలేసిన కెపాసిటీ రూల్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం!

సామాన్య ప్రజలకు తమ గమ్యస్థానానికి చేర్చడంలో కీలకపాత్ర పోషించేది ఏ మాత్రం సందేహం లేకుండా ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్సులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

దోపిడీ చేశారనే ప్రజలు బీఆర్ఎస్‌ను పక్కనబెట్టారు: సీఎం రేవంత్

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్థరణలో భాగంగా ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్న ‘మాగ్నెటిక్‌ జియోఫిజికల్‌ సర్వే’ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

మావోయిస్టు పార్టీ మాజీ అగ్ర‌నేత మ‌ల్లోజుల వీడియో రిలీజ్

మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆపరేషన్ కగార్ అనంతర పరిణామాలు..తన లొంగుబాటుకు దారితీసిన పరిస్థితులు, పార్టీలో తలెత్తిన పరిణామాలు వంటి వాటిపై వివరణాత్మకంగా వివరించారు

భారత్ ఏను గెలిపించిన రిషబ్ పంత్

బెంగుళూరు వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మొదటి అనధికారిక టెస్టులో భారత్‌-ఎ జట్టు 3వికెట్లతో విజయం సాధించింది. రిషబ్ పంత్ భారత్ ఏను తన అధ్బుత పోరాట పటిమతో కూడిన బ్యాటింగ్ తో గెలిపించి మరో సారి తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు.

7-Foot Sri Lankan Net ball player Woman

తిరుమల క్యూలైన్లలో పొడగరి మహిళ.. ఎవరంటే..!?

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలోకి వచ్చిన ఏడు అడుగులకు పైగా ఎత్తు ఉన్న మహిళా భక్తురాలు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె శ్రీలంకకు చెందిన నెట్‌బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగంగా గుర్తించారు.