లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?

ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతల రాజకీయ భవిష్యత్తేంటనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సీపీఐ నాయకత్వాన్ని పలువురు మావోయిస్టు మాజీ నేతలు కలువడంతో ఈ చర్చ మళ్లీ ఊపందుకున్నది. లొంగుబాట్లకు ముందే భిన్నాభిప్రాయాలతో ఉన్న నాయకులు.. ఇప్పుడు అంతా కలిసి మూకుమ్మడి నిర్ణయాలు తీసుకుంటారా? లేక వ్యక్తులుగా తమ తమ అంచనాల మేరకు వివిధ రాజకీయ పార్టీల్లో చేరతారా? అనేది తేలాల్సి ఉంది.

విధాత ప్రత్యేకం

‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…

తెలంగాణ ప్రజల దశాబ్దాల సమిష్టి పోరాట ఫలితం… వందలాది మంది బిడ్డల బలిదానానికి ప్రతిరూపం ... ఆంధ్ర ఆధిపత్య శక్తులు, పెత్తందారుల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి ... స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు. రాజకీయ భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా ... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజు... వేడుక నిర్వహించుకుని గతాన్ని బేరీజు వేసుకుని, భవిష్యత్తును తీర్చదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించుకునే ప్రత్యేక రోజు. తెలంగాణ ప్రజలు ఆనందంతో నిర్వహించుకునే పర్వదినం. అంతటి ఉద్వేగ భరితమైన రోజున రాజకీయ రచ్చకోసం కుట్రలు చేశారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన సంతోషాన్ని దక్కకుండా చేయడమనే కుట్ర దాగి ఉందనే చర్చకు ఆస్కారాన్ని కలిగిస్తున్నారు.

విధాత ప్రత్యేకం

వేల కోట్లకు బ్యాంకులను ముంచి.. విదేశాలకు పరార్‌.. ఇది చోక్సీ, నీరవ్‌ కథ

బ్యాంకులను ముంచేసిన బడా బాబుల జాబితాలో మరో కీలక పేరు.. మొహుల్‌ చోక్సీ. నీరవ్‌ మోడీకి మేనమామ. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండెడ్‌ ఆభరణాల చైన్‌ రిటైల్‌ షోరూమ్‌ జెమ్స్‌ అధినేత. ఆభరణాల వ్యాపారంలో దేశంలో 50 శాతానికి పైగా వాటా ఈ కంపెనీదే. ఈ సంస్థ దేశంలోని బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 7వేల కోట్ల రూపాయల పైమాటే. ఇక అనుబంధ కంపెనీల మొత్తాన్ని కలుపుకొంటే.. రూ.27,500 కోట్ల వరకు ఉన్నాయని అంచనా. నీరవ్‌మోడీ, ఐవీఆర్‌సీఎల్ కథలూ ఇవే.

విధాత ప్రత్యేకం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేళ సెంటి‘మంటలు’

తెలంగాణవాదులుగా చెప్పుకొనే వారు కూడా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు అనుసరించిన అవకాశవాద విధానాల ఫలితంగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ‘నినాదాలు’గా మిగిలిపోయాయనే విమర్శలున్నాయి. దీంతో గోతికాడి నక్కల్లా కాచుకుని కూర్చున్న తెలంగాణలోని సమైక్యవాదులు క్రమంగా రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శక్తులు ఇటీవల కాలంలో నెమ్మదిగా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

సైకిల్‌తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు

సైకిల్‌తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గ్రీన్ కవర్ పెంపు, పర్యావరణ పరిరక్షణపై పిలుపునిచ్చారు.

బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ

బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. తమిళ అస్థిత్వం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

కొనసాగుతున్న  రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు

కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలకు సంబంధించి 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 8వ తేదీ వరకూ నామినేషన్ల ధాఖలు ప్రక్రియ కొనసాగనుంది.

అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్

అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సదర్బంగా ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్కులో నిర్వహించిన పర్యావరణ వేడుకలలో పవన్‌ పాల్గొన్నారు. తన తల్లి అంజనా దేవి పేరిట కొండపల్లి బొమ్మల తయారీలో వినియోగించే తెల్ల పొణికి మొక్క నాటి వేడుకలు ప్రారంభించారు.

Monsoon | నాలుగైదు రోజుల్లో తెలంగాణ‌లోకి నైరుతి రుతుప‌వ‌నాలు..!

Monsoon | నాలుగైదు రోజుల్లో తెలంగాణ‌లోకి నైరుతి రుతుప‌వ‌నాలు..!

Monsoon | నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లోకి ప్ర‌వేశించాయి. కేర‌ళ‌తో పాటు త‌మిళ‌నాడులోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు.. మ‌రో రెండు రోజుల్లో ఇత‌ర ప్రాంతాల్లోకి విస్త‌రించ‌నున్నాయి.