Viral News | ఓ జంట మధ్య సోషల్ మీడియా వేదికగా స్నేహం చిగురించింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరికొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక తొలిరాత్రికి సమయం రానే వచ్చింది. కానీ శోభనం గదిలో వధువును చూసి వరుడు షాక్ అయ్యాడు. పొద్దున్నే పోలీసు స్టేషన్కు పరుగులు పెట్టాడు వరుడు.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని దర్గాపూర్కు చెందిన సుఖ్లాల్(30) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అయితే సుఖ్లాల్కు ఒకమ్మాయి పరిచయమైంది. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో తమ ప్రతిపాదనను పేరెంట్స్ వద్దకు తీసుకెళ్లారు. ఇరు కుటుంబాలు కూడా వారి పెళ్లికి అంగీకరించాయి. దీంతో పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెళ్లైన మరుసటి రోజే ఆ నూతన దంపతులకు శోభనం నిర్వహించారు.
ఇక శోభనం గదిలోకి వెళ్లిన వరుడికి ఊహించని షాక్ తగిలింది. వధువు ట్రాన్స్జెండర్ అని తేలిపోయింది. దీంతో లబోదిబోమంటూ.. పొద్దున్నే లేచి పోలీసు స్టేషన్కు పరుగులు పెట్టాడు. తనకు విడాకులు కావాలని ఆమెను కోరగా, భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేసినట్లు తన ఫిర్యాదులో సుఖ్లాల్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.